అభిమానులకి తారక్ సందేశం

తారక్ దేవర సినిమా తర్వాత బాలీవుడ్ సినిమా వార్ 2 చిత్రీకరణలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నారు. అయితే ఈరోజు తారక్ టీం తారక్ అభిమానులని ఉద్దేశించి ఒక సందేశాన్ని విడుదల చేసారు.

ఆ సందేశంలో “మీరు చూపిస్తున్న ప్రేమకి అభిమానానికి ధన్యవాదములు. తనని కలవాలనే అభిమానుల ఉత్సాహాన్ని ఆయన అర్థం చేసుకుని మీ అందర్నీ ఆయనే త్వరలోనే స్వయంగా కలవాలనుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా, అన్ని రకాల అనుమతులు తీసుకుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతవరకూ కొంత సమయం పడుతుంది, ఈ మధ్యలో దయచేసి అభిమానులెవ్వరూ తనని కలిసేందుకు పాదయాత్ర లాంటివి చేసి ఇబ్బంది పడొద్దు, మీ అందరు బాగుండటం ఆయనకి ఎంతో ముఖ్యం” అని ఉంది.

ఈ మధ్య అభిమానులు తమ అభిమాన హీరోలని కలిసేందుకు ఇలా పాదయాత్రలా వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. అలా తన అభిమానులు ఎవరూ ఇబ్బందై పడద్కూడదని తనే స్వయంగా అందరిని కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని, అంతవరకూ సమన్వయం పాటించాలని సారాంశం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *