దిల్ రాజు: గేం చేంజర్ టికెట్ రేట్ల కోసం రేవంత్ రెడ్డి గారిని కలుస్తా

Revanth Reddy meeting Dilraju

ఈసారి సంక్రాంతి పండగకు టాలీవుడ్‌ ప్రేక్షకులకు ప్రత్యేకమైన వినోదం అందించేందుకు మూడు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలు సందడి చేయనున్నాయి. ఈ మూడు సినిమాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంక్రాంతి సినిమాల కోసం టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ నిర్ణయం నిర్మాతలకు కొంత ఊరట కలిగించింది. అయితే, తెలంగాణలో ఈ విషయంలో ఇంకా స్పష్టత లేదు.

ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలంగాణలో కూడా టికెట్‌ రేట్ల పెంపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించనున్నట్లు తెలిపారు. నిర్మాతగా టికెట్ రేట్ల కోసం తన ప్రయత్నం తను చేస్తానని, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని అన్నారు. గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడుతూ, ఈ సినిమా తనకు ఒక ముఖ్యమైన మైలురాయి అని, చిరంజీవి గారు సినిమా చూసి అభినందించారని చెప్పారు. ఆయన ప్రకారం, ఈ చిత్రానికి పాటల కోసం మాత్రమే 75 కోట్లు ఖర్చు చేశారు.

దిల్ రాజు తన సంక్రాంతి చిత్రాలు ప్రేక్షకులకు పూర్తి వినోదం అందిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతి పండగతో ప్రేక్షకులు తమ సినిమాలను ఎంజాయ్ చేస్తారని, దాంతో మరోసారి తన కెరీర్‌లో కమ్‌బ్యాక్‌ సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *